టీడీపీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చినబాబు ఇంటర్నల్ వార్కు సిద్ధమయ్యాడట. దీని కోసం పార్టీలో సీనియర్లుగా, తన అజమాయిషీకి అడ్డుగా ఉన్న సీనియర్లపై వ్యక్తిత్వ హననానికి రెడీ అయినట్లు సమాచారం. సోషల్మీడియాలో, అనుకూల మెయిన్స్ట్రీమ్ మీడియాలో తన మనుషుల ద్వారా సోషల్ వార్కు తెరలేపేందుకు సిద్ధమయ్యాడు. అంతర్గత వర్గాలు అందించిన వివరాలు టీడీపీ రాజకీయాల్లో అత్యంత సంచలనాలకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. పనిలో పనిగా ప్రత్యర్థి పార్టీలపై బురదజల్లేందుకు ఈ వార్ను వినియోగించుకోవాలన్నది చినబాబు వ్యూహంగా కనిపిస్తోంది.
డిప్యూటీ కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే కన్నేసిన చినబాబు. ఇప్పటికే మంత్రివర్గం ఏర్పాటులోనూ, యంత్రాంగం కూర్పులోనూ పూర్తిగా తన మాటవినే మనుషులకే పెద్దపీట వేసేలా వ్యూహం అమలు చేశారన్న అభిప్రాయాలున్నాయి. దీంతో పాటు డిప్యూటీ సీఎంగా తనను నియమించాలనే డిమాండ్ను కూడా తన సొంత మనుషులచేత ప్రచారం చేయించుకున్నారు. కాని టీడీపీలో మొదట నుంచి ఉన్న ఇద్దరు సీనియర్లు ఇది ఎవరో తేల్చాల్సిన విషయం కాదని, ప్రజలే నిర్ణయిస్తారంటూ చురకలు వేశారు. చినబాబు వర్గంలో ఇది తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇలాంటి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి సోషల్ వార్కు తెరలేపారు.
ఇటీవలే తన చలవతో సీటు దక్కించుకున్న ‘ప్రావీణ్యం’పైన చినబాబుకు నమ్మకం ఉంది. అతడి సహాయంతో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 600కు పైగా కంప్యూటర్ సిస్టమ్స్ పెట్టించి, తన అనుకూల యువకులను సిబ్బందిగా పెట్టాలన్నది చినబాబు ప్లాన్.
అక్కడి నుంచి సోషల్ మీడియా వార్కు రెడీ అవుతున్నారు. పార్టీలో తనను వ్యతిరేకించే వారి మీద అడ్డగోలు ప్రచారం చేసి వారిని బలహీన పరచడంతో పాటు వారిని నైతికంగా దెబ్బతీయాలన్నది వ్యూహం. అదే సమయంలో ఇదే పద్ధతిలో ఇప్పుడు కొనసాగుతున్నట్టుగా ప్రత్యర్థి పార్టీలపై కూడ బురదజల్లే కార్యక్రమాలు కొనసాగాలన్నది ఈ వ్యూహల్లో భాగంగా కనిపిస్తోంది.