తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా, ప్రారంభమైన వెంటనే మంత్రివర్గ సమావేశం కొనసాగుతుందని, సభను వాయిదా వేయాల్సిందిగా స్పీకర్ గడ్డ ప్రసాద్ను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. మంత్రి అభ్యర్థన మేరకు స్పీకర్ శాసనసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేసింది.
కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో చర్చకు పెట్టనున్న ప్రభుత్వం దీనిపై మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ మీటింగ్లో కులగణన నివేదికకు ఆమోదం లభించినట్లు సమాచారం. కాగా, శాసనసభ ప్రారంభం అయిన వెంటనే వాయిదా వేయడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.