రన్‌వేపై టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు

రన్‌వేపై టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు

జార్జి బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్న విమానంలో అకస్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం రెక్కలో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన సిబ్బంది అత్యవసర తలుపును తెరిచి ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్ల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా దింపారు. వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్టు అగ్నిమాపక దళం మంటలను ఆర్పివేసింది. దీంతో పెనుప్ర‌మాదం త‌ప్పింది.

సాంకేతిక లోపమే కారణం?
ఈ ప్రమాదానికి కారణం విమానం ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపమేనని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల కోసం మధ్యాహ్నం 12.30 గంటలకు మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ప్రయాణికురాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

ఇటీవలి కాలంలో అమెరికాలో చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. జనవరి 30న జరిగిన మిలిటరీ హెలికాప్టర్, కమర్షియల్ విమానం ఢీకొన్న ఘటనతో పాటు, ఫిలడెల్ఫియాలో మెడికల్ ట్రాన్స్‌పోర్టర్ విమానం కూలిన ఘటనల కారణంగా ఎఫ్‌ఏఏ (FAA) దర్యాప్తును వేగవంతం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment