U19 T20 World Cup: ఫైనల్‌కు భారత అమ్మాయిల జ‌ట్టు

U19 T20 World Cup: ఫైనల్‌కు భారత అమ్మాయిల జ‌ట్టు

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత యువ జ‌ట్టు అదిరిపోయే ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్-2లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ న‌ష్టానికి 15 ఓవర్లలోనే ఛేదించింది.

కమలిని (56) నాటౌట్‌ అర్ధశతకంతో మెరిశింది, అలాగే త్రిష (35) కూడా శక్తివంతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఇక ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు కప్పు కోసం పోటీ పడనున్నాయి. భారత యువ క్రికెట‌ర్ల అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరిస్తున్నారు. ఫైనల్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తారా? వేచి చూద్దాం!

Join WhatsApp

Join Now

Leave a Comment