తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలీసుల తీరుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రినారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలీసులు ఎక్కువగా ఉండటంపై లోకేష్ సీరియస్ అయ్యారు. ఇంతమంది సెక్యూరిటీగా ఎందుకు వచ్చారంటూ అధికారులను ప్రశ్నించారు. బందోబస్తు పేరుతో పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయొద్దని లోకేష్ ఆదేశించారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రతిరోజు కార్యకర్తలు వస్తారు.. వారిని పోలీసులు ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.
అధికారంలో ఉన్న పార్టీ కార్యాలయానికి వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతుండటంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులపై మంత్రి లోకేశ్ అసహనం వ్యక్తం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.