జూలై-ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగిన విద్యార్థుల హింసాత్మక ఉద్యమ సమయంలో 800 మందికి పైగా ఖైదీలు (Prison Escape) వివిధ జైళ్ల నుండి తప్పించుకున్నారు. షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం పతనమైన తర్వాత, దాదాపు ఏడు నెలలుగా వీరిలో 700 మంది జాడ తెలియకపోవడం చర్చనీయాంశమైంది. పారిపోయిన ఖైదీలలో చాలా మంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు(Terrorism), మరణశిక్ష పడిన వారు ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, దేశంలోనూ, భారతదేశంలోనూ భయాలు రేకెత్తించింది.
భారతదేశంపై ప్రభావం
మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, భారత వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయని సమాచారం. దీంతో పారిపోయిన ఖైదీలు భారతదేశంలోకి చొరబడి ఉండవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల స్పందన
హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ప్రకారం, పారిపోయిన ఖైదీలను తిరిగి పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. “పరారీలో ఉన్న ఖైదీలపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త నేరాలకు పాల్పడితే, వారు మరింత తీవ్రంగా శిక్షించబడతారు” అని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఆందోళనలు
ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన జైలు దోపిడీ సంఘటనలు, అందులో డాకా సమీపంలోని నర్సింగ్డి జిల్లాలో 826 మంది ఖైదీల పరార్ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.