‘ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లనాని’ పాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సింగర్ మధు ప్రియ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ప్రైవేట్ ఆల్బమ్ కోసం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో గర్భగుడిలో సాంగ్ను షూట్ చేయడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై స్థానికులు మరియు భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
గర్భగుడిలో చిత్రీకరణ జరపడం ఏమాత్రం సమంజసం కాదని, ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలకు దెబ్బతీస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. “గర్భగుడిలో షూట్కు అనుమతి ఎవరు ఇచ్చారు?” అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంక్రాంతి పాటతో మళ్లీ సక్సెస్
ఇదిలా ఉండగా, మధు ప్రియ ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన “గోదారి గట్టుమీద” పాటను ఆలపించారు. ఈ పాట ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. యూట్యూబ్లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సంపాదించుకుంటూ దూసుకుపోతోంది.