మ‌హారాష్ట్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదం..

మ‌హారాష్ట్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదం..

మహారాష్ట్రలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ట్టాల‌పై ప్ర‌యాణిస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో అనుకోకుండా మంటలు చెలరేగాయన్న వ‌దంతులు త‌లెత్త‌డంతో భ‌యంతో ప్ర‌యాణికులు చైన్ లాగారు. మంట‌ల వ్యాప్తి అన్న పుకార్ల‌తో చైన్ లాగిన ప్ర‌యాణికులు ప‌క్క‌నున్న ట్రాక్‌పైకి దూకారు. దీంతో అటుగా వ‌స్తున్న క‌ర్ణాట‌క ఎక్స్‌ప్రెస్ ప్ర‌యాణికుల మీద‌కు దూసుకొచ్చింది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 8 మంది మృతిచెందిన‌ట్లుగా ప్రాథ‌మిక స‌మాచారం.

మ‌హారాష్ట్ర‌లోని జ‌ల‌గావ్ జిల్లా ప‌రండా రైల్వేస్టేష‌న్ స‌మీపంలో జ‌రిగిన ఈ రైలు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌ను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment