ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి విషయంలో రాజకీయ రగడ కొనసాగుతుండగా.. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటన కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్ బృందం బయల్దేరింది. జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామిక వేత్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు బృందం హాజరైంది.
తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో సాక్షాత్తూ చంద్రబాబు సమక్షంలో మాకు కాబోయే సీఎం లోకేష్ అంటూ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్ ఈజ్ లోకేష్ అండ్ ఫ్యూచర్ లో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం పదవి లోకేశ్కు ఇవ్వాలని గత రెండ్రోజులుగా డిమాండ్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్లను జనసేన తీవ్రంగా పరిగణిస్తోంది. పవన్తో సమానమైన హోదా లోకేశ్ ఇవ్వడం ఏంటని బహిరంగంగానే ప్రశ్నిస్తోంది. మరిప్పుడు సాక్షాత్తు చంద్రబాబు సమక్షంలోనే కేబినెట్ మంత్రి లోకేశ్ కాబోయే సీఎం అన్న వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.
లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్పై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉందని, అత్యుత్సాహం వద్దని నేతలను వారించిన టీడీపీ. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని ప్రకటించి రెండు గంటలు కూడా గడవకముందే మంత్రి నోటి నుంచి ఈ వ్యాఖ్య రావడం గమనార్హం