జర్నలిస్ట్పై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్బాబుకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్పై విచారణ ముగిసేంత వరకు మోహన్బాబును అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. జల్పల్లిలోని నివాసంలో తలెత్తిన కుటుంబ వివాదాలను కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టుపై మోహన్బాబు దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ దాడిలో ప్రముఖ మీడియా ఛానల్ ప్రతినిధి ఎముక విరిగింది.
కాగా, విచారణకు హాజరుకావాలని మోహన్బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మోహన్బాబు పిటిషన్ను తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మోహన్బాబు పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు పలు కీలక సూచనలు చేసింది.
మోహన్బాబు తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జర్నలిస్ట్కు మోహన్బాబు క్షమాపణలు చెప్పారని, పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని వాదనలు వినిపించారు. బహిరంగ క్షమాపణ చెప్పేందుకు కూడా మోహన్బాబు సిద్ధంగా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఒక్కసారిగా ఇంటిపైకి 40 మంది గుంపుగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందన్న రోహత్గీ వాదనకు కోర్టు ఘాటుగా స్పందించింది. అలా ఇంటిపైకి వస్తే దాడి చేస్తారా అని ప్రశ్నించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసిన కోర్టు.. అప్పటి వరకు కఠిన చర్యలు వద్దు అని సూచించింది.