క్రికెట్‌కి గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన మార్టిన్ గప్టిల్

క్రికెట్‌కి గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన మార్టిన్ గప్టిల్

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 38 ఏళ్ల వయసులో గప్టిల్ తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్టిన్ గప్టిల్ త‌న‌ కెరీర్‌లో 198 వన్డేలు, 122 టీ20లు, 47 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 13,463 ప‌రుగులు, 23 సెంచ‌రీలు చేశారు. గ‌ప్టిల్ 2022 సెప్టెంబర్‌లో చివరి వన్డే ఆడారు. వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన కివీస్ క్రికెటర్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

మార్టిన్ గప్టిల్ రిటైర్మెంట్ న్యూజిలాండ్ క్రికెట్‌కు పెద్ద షాక్ అని, అత‌ని అద్భుత బ్యాటింగ్ క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుంటాయ‌ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అభిప్రాయ‌ప‌డింది. ఆయ‌న జ‌ట్టుకు అందించిన సేవ‌ల‌ను కొనియాడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment