ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) డీఎస్సీ-2025 (DSC-2025) నియామకాల్లో అవకతవకలు జరిగాయని పోరాటం కొనసాగుతున్న వేళ.. ఉద్యోగాల పేరుతో తన వద్ద డబ్బులు వసూలు చేశారంటూ ఓ బాధితురాలు (Victim) ఆధారాలతో సహా మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది. స్పోర్ట్స్ కోటాలో(Sports Quota) డీఎస్సీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ తన వద్ద నుంచి రూ.14.5 లక్షలు వసూలు చేసి మోసం చేశారని రాధిక (Radhika) అనే బాధితురాలు ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ను (YS Jagan) కలిసి వివరించారు.
పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి టీడీపీ కార్యకర్తలు (TDP Workers) మెడికొండ జ్యోతి(Medikonda Jyothi), అడపా భాను ప్రకాష్ (Adapa Bhanu Prakash) తన వద్ద నుంచి రూ.14.5 లక్షలు తీసుకున్నారని రాధిక ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కోటాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారని ఆమె పేర్కొన్నారు. డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ (School Assistant Social) సోషల్ పోస్టు ఇప్పిస్తామని కూడా హామీ ఇచ్చారని బాధితురాలు ఆరోపించారు. ఉద్యోగం కోసం అడిగిన మొత్తాన్ని చెల్లించినప్పటికీ చివరకు తనకు ఉద్యోగం ఇవ్వకుండా మరో వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు జరిగిన మోసంపై పోలీసులను(Police) ఆశ్రయించి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాధిక ఆరోపించారు. దాదాపు 10 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, ఎస్పీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని చెప్పారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపుతామని కూడా నిందితులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.
డీఎస్సీ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎఫ్ఐఆర్లో ఆ అంశాన్ని నమోదు చేయలేదని రాధిక (Radhika)ఆరోపించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తనకు జరిగిన మోసం, పోలీసులకు చేసిన ఫిర్యాదులు, తన వద్ద ఉన్న ఆధారాల వివరాలను వైఎస్ జగన్కు వివరించినట్లు రాధిక తెలిపారు.
ఇప్పటికే డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష వైసీపీ పోరాటం చేస్తోంది. రాత పరీక్ష నిర్వహణ, స్పోర్ట్స్ కోటా నిబంధనలు, నియామకాల ప్రక్రియపై (Recruitment Process) ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో రాధిక చేసిన రూ.14.5 లక్షల వసూళ్ల ఆరోపణలు డీఎస్సీ వ్యవహారంలో మరో అంశాన్ని తెరపైకి తెచ్చాయి. అయితే ఆమె ఆరోపణలు, ఫిర్యాదులపై పోలీసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, ఫిర్యాదులపై దర్యాప్తు పూర్తయితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఏపీ డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం
— Telugu Feed (@Telugufeedsite) August 20, 2026
బాధితురాలి నుంచి రూ.14.5 లక్షలు వసూలు చేసిన టీడీపీ నేతలు..
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసం రూ.14.5 లక్షలు వసూలు
ఆధారాలు బయటపెట్టిన బాధితురాలు రాధిక.. వైయస్ జగన్ ను కలిసి ఫిర్యాదు
మంత్రి లోకేష్ కోటాలో ఉద్యోగం అంటూ మోసం చేశారని… pic.twitter.com/XiEnB1EdPO








