ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు (చివరి) తొలిరోజు భారత్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. టీ సమయానికి 4 వికెట్లకు 107 పరుగుల వద్ద నిలిచిన భారత్, చివరి సెషన్లో కేవలం 78 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి, తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది. భారత్ తరఫున రిషబ్ పంత్ 98 బంతుల్లో 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ, మిగతా బ్యాట్స్మెన్ నుంచి సహకారం లేకపోవడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాప్ ఆర్డర్లు అంతా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4/31తో అద్భుత ప్రదర్శన చేశాడు. అతని పేస్, లైన్, లెంగ్త్ భారత బ్యాటింగ్ లైనప్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, పాట్ కమిన్స్ 2 వికెట్లు, నాథన్ లియాన్ ఒక వికెట్ తీశారు.
కెప్టెన్ రోహిత్ విశ్రాంతి
ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో జస్ప్రీత్ బూమ్రా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం భారత్ సిరీస్లో 1-2తో వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్ను గెలుచుకొని సిరీస్ను సమం చేయడం భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్ 72.2 ఓవర్లలో 185 ఆలౌట్ (రిషబ్ పంత్ 40, శుభ్మన్ గిల్ 20; స్కాట్ బోలాండ్ 4/31). మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 9 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.