అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. జ్యోతి తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తెచ్చారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో సాధారణ కుటుంబంలో పుట్టి, జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించిన జ్యోతి, దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని వైఎస్ జగన్ అన్నారు. జ్యోతి యర్రాజీ భవిష్యత్తులోనూ తన విజయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
జ్యోతి యర్రాజీ, అథ్లెటిక్స్ విభాగంలో అర్జున అవార్డును పొందిన మొదటి భారతీయ అథ్లెట్గా రికార్డు సృష్టించారు. 100 మీటర్ల హర్డిల్స్లో పోటీ చేసి, ఒలింపిక్స్లో పాల్గొన్న మొదటి భారతీయ అథ్లెట్గా ఆమె గుర్తింపు పొందింది. వరంగల్కు చెందిన పారా అథ్లెట్ దీప్తి జీవాంజి కూడా అర్జున అవార్డు గెలిచిన విషయం తెలిసిందే. ఆమెకు కూడా వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
ఖేల్రత్న గ్రహీతలకి అభినందనలు
అదే విధంగా ఖేల్ రత్న అవార్డు పొందిన దొమ్మరాజు గుకేశ్ (చెస్), మనూ భాకర్ (షూటింగ్), హర్మన్ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెట్)లను కూడా వైఎస్ జగన్ అభినందించారు.