గుజరాత్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు

గుజరాత్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు

గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో బుధవారం ఉదయం 3.2 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ (ISR) ప్రకారం.. ఈ భూకంపం భచౌ నుండి 23 కిలోమీటర్ల ఉత్తర-ఈశాన్య దిశలో కేంద్రీకృతమైంది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అంద‌లేదు. ఈ విషయమై అధికారిక ప్రకటనలు వెలువ‌డాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment