సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’(Cockroach Janata Party – CJP) ట్రెండ్ ఇప్పుడు సెలబ్రిటీల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) తాజాగా ఈ డిజిటల్ వ్యంగ్య ఉద్యమంలో భాగమవుతూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో ఆయన ఐస్క్రీమ్ లో మామిడి పండు గుజ్జు తింటూ కనిపించగా, “కాక్రోచ్ ఈటింగ్ మ్యాంగోస్ (Cockroach Eating Mangoes).. యమ్మీ” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి (Narendra Modi) ఇష్టమైన పండుగా చెప్పుకునే మామిడిని ప్రస్తావిస్తూ #CockroachJantaParty, #justasking హ్యాష్ట్యాగ్లతో చేసిన ఈ పోస్ట్ నెట్టింట భారీ చర్చకు దారితీసింది. తనను తాను “బొద్దింక”గా (Cockroach) అభివర్ణిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఆన్లైన్ ట్రెండ్కు సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతోంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటీమణులు దియా మీర్జా, ఈషా గుప్తా, ఫాతిమా సనా షేక్, దర్శకుడు కునాల్ కోహ్లీ తదితరులు కూడా ఈ పార్టీ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అభిజీత్ దీప్కే ప్రారంభించిన ఈ డిజిటల్ వ్యంగ్య ప్రచారం మొదట చిన్న మీమ్ ట్రెండ్లా మొదలై, ఇప్పుడు భారీ సోషల్ మీడియా ఉద్యమంగా మారింది. మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కేవలం ఆరు రోజుల్లోనే 1.9 కోట్ల ఫాలోవర్లను సంపాదించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.








హేళన నుంచి క్రేజ్ వైపు.. ‘మావిగన్, కాక్రోచ్’ నినాదాలు!