నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తొయిబా (LeT) డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గుండెపోటుతో మరణించాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మక్కీ లాహోర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
2020లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో పాక్లోని యాంటీ టెర్రరిజం కోర్టు మక్కీకి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత నుంచి అతడు తన ప్రొఫైల్ని తక్కువగా ఉంచుకుంటూ ఉన్నాడు. 2023లో ఐక్యరాజ్యసమితి మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్గా గుర్తించింది. దీంతో అతని ఆస్తులు స్తంభించాయి, ప్రయాణాలపై నిషేధం విధించబడింది, ఆయుధాల కొనుగోలుపై కూడా ఆంక్షలు అమలయ్యాయి.
ముంబై ఉగ్రదాడితో మక్కీ సంబంధం
ముంబై ఉగ్రదాడిలో మక్కీకి కీలక పాత్ర ఉంది. 2008 డిసెంబర్లో పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ముంబై చేరుకున్న లష్కరే తొయిబా ఉగ్రవాదులు నగరాన్ని ముట్టడించారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. మక్కీ, ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్కు సన్నిహితుడిగా ఉండేవాడు.
మక్కీ మరణం పాకిస్తాన్ ముతాహిదా ముస్లిం లీగ్ ప్రకటన ద్వారా ధృవీకరించబడింది. హఫీజ్ సయీద్ కూడా ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.