సామాన్యులకు వైద్యం (Medical treatment) మరింత భారమవనుంది. అత్యవసర మెడిసిన్ ధరలను (Medicines Prices) 10 నుంచి 20 శాతం వరకు పెంచేందుకు ఫార్మా కంపెనీలకు (Pharma Companies) కేంద్ర ప్రభుత్వం (Central Government) అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ (Cancer) సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు వాడే అత్యవసర మందుల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.
ధరల పెంపునకు కారణాలివే..
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఫార్మా రంగానికి ముడిపదార్థాల సెగ తగిలిందని వినికిడి. యుద్ధం నేపథ్యంలో సముద్ర మార్గాల్లో రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో ముడిపదార్థాల (API) సరఫరా మందగించింది. రవాణా ఛార్జీలు మరియు తయారీ వ్యయం విపరీతంగా పెరగడంతో, ప్రస్తుత ధరలకు మందులను విక్రయించడం భారమవుతోందని ఫార్మా కంపెనీలు కేంద్రానికి విన్నవించాయి. ధరలను పెంచడానికి అనుమతించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) పై కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి.
తాత్కాలిక ఉపశమనం ఉంటుందా?
ఈ ధరల పెంపుపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గంభీరంగా చర్చిస్తోంది. అయితే ఈ పెంపు శాశ్వతం కాదని, కేవలం 3 నెలల కాలానికి మాత్రమే తాత్కాలికంగా అనుమతి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడి, సరఫరా గొలుసు పునరుద్ధరించబడిన తర్వాత ధరలను మళ్ళీ పాత స్థితికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
రోగులపై ప్రభావం
అత్యవసర జాబితాలో ఉన్న మందుల ధరలు పెరిగితే, మధ్యతరగతి మరియు పేద వర్గాల బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే క్యాన్సర్ చికిత్సకు భారీగా ఖర్చవుతుండగా, మందుల ధరలు మరో 20 శాతం పెరిగితే ఆ భారాన్ని మోయడం రోగులకు కష్టతరంగా మారుతుంది. దీనిపై ప్రభుత్వం నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.








తెలంగాణను అవమానిస్తే సహించం.. కేటీఆర్, హరీష్ ఫైర్