న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాటం చేస్తా.. అంబ‌టి హెచ్చరిక

మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తన ఇల్లు (House), కార్యాలయంపై జరిగిన దాడి (Attack) ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, విచారణ అధికారిని మార్చాలని కోరారు. అలాగే నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో జరిగిన కస్టోడియల్ టార్చర్ (Custodial Torture) ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని మరో ఫిర్యాదు కూడా సమర్పించారు.

దాడి, అరెస్ట్‌పై తీవ్ర ఆరోపణలు
జనవరి 31వ‌ తేదీన తన ఇల్లు, కార్యాలయంపై (Office) సుమారు ఏడు గంటల పాటు దాడి జరిగిందని అంబటి రాంబాబు ఆరోపించారు. దాడి అనంతరం తనను అరెస్ట్ చేసి పద్దెనిమిది రోజుల తర్వాత బెయిల్‌పై(Bail) విడుదల చేశారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు స్వయంగా కేసు నమోదు చేయకుండా, తాను ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేశారని విమర్శించారు.

పోలీసుల తీరుపై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దాడి చేసిన వారిపై తేలికపాటి కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారని, అదే సమయంలో తనపై మాత్రం కేసులు పెట్టి జైలుకు(Jail) పంపారని ఆరోపించారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు (Ganga Venkateswarlu) ఈ కేసులో అన్యాయంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

కీలక డిమాండ్లు, రాజకీయ ఆరోపణలు
ఈ ఘటనపై దాడి, హత్యాయత్నం, ఆస్తి నష్టం కేసులు నమోదు చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (Special Investigation Team – SIT) ఏర్పాటు చేసి విచారణ జరపాలని కోరారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకుని కస్టోడియల్ టార్చర్‌పై విచారణ జరపాలని అన్నారు.

ఈ ఘటన వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఉన్నారని ఆరోపిస్తూ, టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. తనపై నమోదైన కేసులు, అరెస్ట్ విధానంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment