కాంగ్రెస్ పార్టీ (Indian National Congress) తాజాగా 2026 రాజ్యసభ ఎన్నికలకు (2026 Rajya Sabha Elections) సంబంధించిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ (Telangana)నుంచి అభిషేక్ సింగ్వి (Abhishek Singhvi), వేం నరేందర్ రెడ్డికి (Vem Narender Reddy) అవకాశం లభించింది. ఇదే క్రమంలో తమిళనాడు నుంచి క్రిస్టోఫర్ తిలక్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ, హర్యానా నుంచి కరమ్ వీర్ సింగ్, చత్తీస్గఢ్ నుంచి ఫులోదేవి నేతం కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ఎంపిక చేసింది. ఈ నిర్ణయం తో కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్ ముగిసినట్లయింది.
ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగియనుందని అధికారికంగా ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేస్తారని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ (BRS) నుంచి నామినేషన్ వేయకుంటే, కొన్ని సిటీలలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది 2026 రాజ్యసభ ఎన్నికలకు మరిన్ని ఉత్కంఠను తెస్తుందనేది రాజకీయ వర్గాల అంచనాది.







