కూటమి ప్రభుత్వానికి ఆర్కే రోజా బహిరంగ సవాల్

కూటమి ప్రభుత్వానికి ఆర్కే రోజా బహిరంగ సవాల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తిరుపతి జిల్లా న‌గ‌రిలో జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “నేను అవినీతి చేసుంటే నిరూపించండి” అంటూ బహిరంగ సవాల్ విసిరారు. “మీ దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి. నా తప్పు ఏంటో నిరూపించండి,” అని ఛాలెంజ్ చేశారు.

జ‌గ‌న్ క‌టౌట్ చూసి భ‌య‌ప‌డుతున్నారు
“ఇన్నాళ్లు జగన్‌ను చూస్తే భయపడ్డారు. ఇప్పుడు ఆయన కటౌట్ చూసినా భయపడుతున్నారు” అంటూ టీడీపీ నేత‌ల‌ను ఎద్దేవా చేశారు. ఆరు నెల‌ల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విప‌రీతంగా పెరిగింద‌ని వ్యాఖ్యానించారు. “మా పార్టీ నాయకుల ఆస్తులను కూలదోచినా, వేధించినా వడ్డీతో సహా తిరిగి ఇచ్చిస్తాం” అని ఆర్కే రోజా హెచ్చరించారు.

కుల, మత తారతమ్యం అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్‌కే ద‌క్కుతుంద‌ని ఆర్కే రోజా అన్నారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బాబు షూరిటీ-భ‌విష్య‌త్తు గ్యారంటీ అనే హామీ ఇచ్చి ఇప్పుడు బాదుడే బాదుడు గ్యారంటీ అమ‌లు చేస్తున్నారని విమ‌ర్శించారు. “పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో పబ్బులు, బెల్ట్ షాపులు పెడుతున్నారు” అంటూ రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్కే రోజా వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment