తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో నేటి వరకు అమలవుతున్న ధరణి విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నామని చెప్పారు. ధరణిని పూర్తిగా మార్చి భూభారతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు.
అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. కాగా, సభలో దీనిపై చర్చ జరిగింది. “ధరణిని గత పాలకులు ప్రజలపై రుద్దారు. పేదలు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. కానీ, ఇప్పుడు భూభారతి ద్వారా సమస్యల పరిష్కారానికి కొత్త మార్గం సృష్టించాం. RDO, కలెక్టర్లు అప్పీల్ అథారిటీగా ఉంటారు. ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం” అని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఈ ప్రక్షాళన వల్ల రైతులు, సామాన్య ప్రజలకు భూసమస్యలపై న్యాయం జరగబోతుందని మంత్రి పొంగులేటి విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.