ఈనెల 4వ తేదీన ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించగా, ఆమె కుమారుడు ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో ఇటీవల ఆ సినిమా హీరో సైతం అరెస్టు అయ్యి మధ్యంతర బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యంపై చర్యలకు ప్రభుత్వం పూనుకున్నట్లు సమాచారం. సంథ్య థియేటర్ లైసెన్సును రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. థియేటర్ యాజమాన్యానికి త్వరలోనే షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ తెలంగాణ ప్రభుత్వ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని థియేటర్ యాజమాన్యంలో గుబులు మొదలైంది. అదే విధంగా సినీ ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లైసెన్స్ రద్దు జరిగితే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.