వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి పాలస్తీనా సమస్య పట్ల తన మద్దతును విభిన్నంగా వ్యక్తం చేశారు. పార్లమెంట్కి ఆమె పాలస్తీనా పేరు రాసిన ప్రత్యేక బ్యాగ్ ధరించి హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్ చర్యలపై గతంలోనూ గళమెత్తిన ప్రియాంక, గాజాలో జరుగుతున్న హింసాత్మక చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ, పార్లమెంట్లో ప్రత్యేకమైన బ్యాగ్ ద్వారా తన సంఘీభావాన్ని ప్రదర్శించారు.
ఇజ్రాయెల్ దుశ్చర్యలపై ప్రియాంక అభ్యంతరం
ఈ ఏడాది జూన్లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చర్యలను ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శించారు. గాజాలో ఇజ్రాయెల్ ప్రభుత్వం జరుపుతున్న చర్యలను ఆమె జాతిహత్యగా పేర్కొన్నారు.
పాలస్తీనా అధికారుల అభినందన
ప్రియాంక గాంధీ సంఘీభావం పట్ల ఢిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయ అధికారులు ఆమెను అభినందించారు. వాయనాడ్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆమె తీసుకుంటున్న నైతిక వైఖరి, హ్యూమానిటేరియన్ భావనలు రాజకీయ వర్గాల్లో ప్రత్యేకత సాధిస్తున్నాయి.