తెలంగాణ (Telangana)లో వరుసగా చెక్డ్యాంలు (Check Dams) కూలిపోవడం (Collapse) రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) బహిరంగ లేఖ (Open Letter) రాస్తూ ప్రభుత్వం పనితీరును తీవ్రంగా ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిపై నిర్మించిన చెక్డ్యాంలు వరుసగా కూలిపోవడం నాణ్యతలేమికి స్పష్టమైన నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తనుగుల–గుంపుల వద్ద చెక్డ్యాం కూలిన ఘటన ప్రజల్లో భారీ ఆందోళన రేపిందన్నారు.
బండి సంజయ్ తన లేఖలో బీఆర్ఎస్(BRS) పాలనలో కమీషన్ల (Commissions) కోసం నాణ్యతను పూర్తిగా పక్కన పెట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఆ కాలంలో చెక్డ్యాంల నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్లు (Contractors) ఎక్కువగా కాంగ్రెస్ నాయకులేనని (Congress Leaders), వీరిపై ఏ చర్యలు తీసుకోకుండా రెండు పార్టీలూ ఒకరిని ఒకరు నిందిస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఆదేశించిన విజిలెన్స్ విచారణ ఇంకా ముందుకు సాగకపోవడం కూడా అనుమానాలకు తావిస్తున్నదన్నారు.
ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి చూపించాలని కోరుతూ బండి సంజయ్ కీలక డిమాండ్లు ఉంచారు. చెక్డ్యాంల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై సంపూర్ణ విచారణను ప్రారంభించి, బాధ్యులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. అంతేకాక, వారి ఆస్తులు జప్తు చేసి అదే నిధులతో చెక్డ్యాంలను మళ్లీ నిర్మించాలని డిమాండ్ చేశారు. చెక్డ్యాంల కూలిపోవడం రాష్ట్ర భద్రతా వ్యవస్థ, నిర్మాణ నాణ్యతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన హెచ్చరించారు.








