ఢిల్లీ (Delhi)లోని ఆంధ్ర భవన్ (Andhra Bhavan)లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు మరియు రాబోయే సీఐఐ సదస్సు (CII Summit) పై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ (Visakhapatnam)లో జరగబోయే సీఐఐ సదస్సు నేపథ్యంలో మాట్లాడిన లోకేష్, పెట్టుబడుల రాకపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
లోకేష్ మాట్లాడుతూ.. “పెట్టుబడుల కోసం వేగవంతమైన సౌకర్యాల కల్పన చాలా ముఖ్యం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు ఏపీని ఎంచుకోవడం రాష్ట్రానికి గర్వకారణం. ఐటీ, తయారీ, సేవలు, పర్యాటక రంగాలు అభివృద్ధికి కీలకమైనవి. సీఎం చంద్రబాబు లక్ష్యాలు నిర్దేశించి ముందుకు సాగాలని స్పష్టంగా ఆదేశించారు” అని చెప్పారు.
“పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంటే, ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తోంది. ‘నమో’ (NaMo) అంటే కేవలం నరేంద్ర మోడీ (Narendra Modi) కాదు, నాయుడు–మోడీ (Naidu–Modi) కలయిక అని చెప్పాలి. పరిశ్రమలు ఏపీని ఎంచుకోవడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. సుస్థిర విధానాలు, పారదర్శక పాలన, అనుకూల వాతావరణం” అని వ్యాఖ్యానించారు.
విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగబోయే సీఐఐ సదస్సులో 410 ఎంఓయూలు కుదురుతాయని, వాటి ద్వారా 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. సంక్షోభ సమయాల్లో భారత్ ఎప్పుడూ వెనుకడగు వేయలేదు. పవర్ టారిఫ్ తగ్గింపు, వేగవంతమైన వ్యాపార అనుమతులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రభుత్వం దృష్టి సారించింది అని అన్నారు.








