సిడ్నీ (Sydney) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన మూడవ వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)కు తీవ్ర గాయం తగిలింది. అక్టోబర్ 25, 2025న ఎడమ వైపు పక్కటెముకల దిగువ భాగాన బంతి బలంగా తగలడంతో, దెబ్బ తీవ్రతకు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పరీక్షల అనంతరం వచ్చిన స్కాన్ రిపోర్ట్లు క్రీడా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేశాయి. అయ్యర్కు అంతర్గతంగా ప్లీహం (Spleen) చీలిక (Laceration Injury) ఏర్పడినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇది సాధారణ గాయం కాదని, తక్షణ వైద్య పర్యవేక్షణ అవసరమని స్పష్టమైంది.
ప్రస్తుత పరిస్థితి, బీసీసీఐ చర్యలు
శుభవార్త ఏమిటంటే, ప్రస్తుతం శ్రేయాస్ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స పొందుతున్నప్పటికీ, అతని ఆరోగ్య పరిస్థితి వైద్యపరంగా స్థిరంగా ఉంది మరియు గాయం నుండి వేగంగా కోలుకుంటున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా, బీసీసీఐ(BCCI) మెడికల్ టీమ్ (Medical Team) పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
సిడ్నీ మరియు భారతదేశంలోని నిపుణులతో నిరంతరం సంప్రదిస్తూ, ప్రతి అప్డేట్ను తీసుకుంటున్నారు. అయ్యర్ రోజువారీ పురోగతిని అంచనా వేయడానికి భారత జట్టు డాక్టర్ సిడ్నీలోనే ఉండి పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రేయాస్ తిరిగి మైదానంలోకి అడుగు పెట్టడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.








ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు