శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి సుమారు 13.9 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి, హైదరాబాద్కు చెందిన సయ్యద్ రిజ్వీ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.