అమెరికా (America)లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో తెలంగాణ (Telangana)కు చెందిన ఒక యువతి (Young Woman) దుర్మరణం చెందింది. మేడ్చల్ (Medchal) మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపల్ పరిధిలో నివసించే శ్రీనివాస్ రావు (Srinivas Rao) పెద్ద కుమార్తె శ్రీజ వర్మ (Srija Varma)(23) ఈ విషాదానికి గురైంది.
అమెరికాలో ఉన్నత విద్య (Higher Education) కోసం వెళ్ళి..ఉన్నత విద్య కోసం అమెరికాలోని చికాగో (Chicago)లోని ఈస్టర్న్ ఇల్లినాయిస్ (Eastern Illinois) విశ్వవిద్యాలయంలో ఎంఎస్(MS) పూర్తి చేసిన శ్రీజ, అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. సోమవారం రాత్రి అర్బనా (Urbana) నగరంలో తన అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్కు భోజనం కోసం నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఆమెను ఢీకొట్టింది.
ఆసుపత్రికి తరలించినా..
తీవ్రగాయాలపాలైన ఆమెను అక్కడి వారు అర్బనా లోని కార్లే హాస్పిటల్కు తరలించగా, వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. తమ కుమార్తెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ వార్త విని విషాదంలో మునిగిపోయారు. తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహాయాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.








