ప్రీతి జింటా టీమ్ కు కొత్త కెప్టెన్ గా డేవిడ్‌ వీస్‌

ప్రీతి జింటా టీమ్ కు కొత్త కెప్టెన్ గా డేవిడ్‌ వీస్‌

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (CPL) 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు, ప్రీతి జింటా సహ యజమానిగా ఉన్న సెయింట్‌ లూసియా కింగ్స్‌ జట్టు తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. గత సీజన్‌లో జట్టును ఛాంపియన్‌గా నిలిపిన ఫాఫ్‌ డుప్లెసిస్‌ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్‌ నుంచి తప్పుకోవడంతో, మేనేజ్‌మెంట్‌ నమీబియాకు చెందిన వెటరన్‌ ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీస్‌కు కెప్టెన్‌ బాధ్యతలను అప్పగించింది.

2021 నుంచి కింగ్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న వీస్‌, ఇప్పటివరకు 26 మ్యాచ్‌లలో 36 వికెట్లు తీసి, 338 పరుగులు చేశాడు. ఈ సీజన్‌ కోసం కింగ్స్‌ జట్టు టిమ్‌ డేవిడ్‌, తబ్రేజ్‌ షంషి వంటి స్టార్‌ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. అలాగే మీకా మెకెంజీ, జావెల్‌ గ్లెన్‌ వంటి యువ ఆటగాళ్లను కూడా జట్టులోకి తీసుకుంది.

గత సీజన్‌ ఫైనల్లో కింగ్స్‌ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గయానా అమెజాన్‌ వారియర్స్‌ను ఓడించి కప్‌ను గెలుచుకుంది. ఈసారి కూడా అదే ఊపును కొనసాగించాలని ఆశిస్తోంది.

సీజన్‌ షెడ్యూల్:

సీపీఎల్‌ 2025 ఆగస్ట్‌ 14న ప్రారంభం కానుంది.

సెయింట్‌ లూసియా కింగ్స్‌ తమ తొలి మ్యాచ్‌ను ఆగస్ట్‌ 17న ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌తో ఆడనుంది.

సెయింట్‌ లూసియా కింగ్స్ స్క్వాడ్:
టిమ్ డేవిడ్, అల్జరి జోసఫ్, జాన్సన్ చార్లెస్, టిమ్ సీఫెర్ట్, రోస్టన్ చేజ్, తబ్రైజ్ షంషి, డేవిడ్ వీస్ (కెప్టెన్‌), డెలానో పోట్గీటర్, మాథ్యూ ఫోర్డ్, ఆరోన్ జోన్స్, ఖారీ పియరీ, జావెల్లె గ్లెన్, మికా మెకెంజీ, షడ్రక్ డెస్కార్టే, జోహన్ జెరెమియా, కియోన్ గాస్టన్, అకీమ్ అగస్టే.

Join WhatsApp

Join Now

Leave a Comment