తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్లు ఈ సమస్యను గుర్తించారు. సుమారు 45 నిమిషాల పాటు ఫ్లైట్ గాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత, తిరిగి తిరుపతి ఎయిర్పోర్ట్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.
ప్రయాణికుల ఆందోళన, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కరువు
ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రయాణికుల కోసం ఇండిగో ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో, తిరుపతి ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరుస ఘటనలతో ప్రయాణికుల్లో భయం
ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత, విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవలే చెన్నై-హైదరాబాద్ ఫ్లైట్లోనూ సాంకేతిక లోపం తలెత్తగా, పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి చెన్నై ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ఫ్లైట్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇప్పుడు మరోసారి ఇటువంటి ఘటన జరగడంతో ప్రయాణికులు మరింత ఆందోళన చెందుతున్నారు.