హజ్ యాత్రికుల విమానంలో మంటలు

హజ్ యాత్రికుల విమానంలో మంటలు

హజ్ (Hajj) యాత్రికులతో (Pilgrims) ప్రయాణిస్తున్న ఒక విమాన (Aircraft) చక్రంలో (Wheel ఒక్కసారిగా మంటలు (Flames) చెలరేగాయి. పొగ (Smoke), నిప్పురవ్వలు (Sparks) రావడంతో పైలట్ (Pilot) అప్రమత్తమై లక్నో ఎయిర్‌పోర్టు (Lucknow Airport)లో సురక్షితంగా ల్యాండ్ (Landed) చేశారు. విమానంలో ఉన్న 250 మంది హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాలిక్ లీక్ (Hydraulic Leak) కారణంగా చక్రంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

ఘటన వివరాలు
సౌదీ ఎయిర్‌లైన్స్‌ (Saudi Airlines)కు చెందిన SV 3112 విమానం శనివారం రాత్రి 10.45 గంటలకు జెడ్డా (Jeddah) నుంచి 250 మంది హజ్ (Hajj) యాత్రికులతో లక్నోకు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ( Chaudhary Charan Singh) అంతర్జాతీయ విమానాశ్రయంకు (International Airport) చేరుకోగానే ల్యాండింగ్ గేర్‌ (Landing Gear)లో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గుర్తించాడు. ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. పైలట్ వెంటనే విమానాన్ని ఆపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. అనంతరం విమానాన్ని వెనక్కి నెట్టి టాక్సీవేకు తరలించారు. అక్కడ ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించేశారు.

విమానాశ్రయ అత్యవసర బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. నురుగు మరియు నీటిని ఉపయోగించి 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అకస్మాత్తుగా హైడ్రాలిక్ లీక్ కావడం వల్లే వీల్ చక్రం అధికంగా వేడెక్కినట్లుగా గుర్తించారు. టేకాఫ్ సమయంలో ఈ సమస్య జరిగి ఉంటే తీవ్రమైన ప్రమాదానికి దారితీసి ఉండేదని అధికారులు తెలిపారు. జెడ్డా నుంచి హజ్ యాత్రికులను తీసుకువచ్చిన ఈ విమానం సౌదీ అరేబియాకు తిరిగి ఖాళీగా వెళ్లాల్సి వచ్చింది.

ఇటీవల అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం
ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. అలాగే, ఆ విమానం హాస్టల్ మీద కూలడంతో 34 మంది మెడికోలు కూడా చనిపోయారు. చికిత్స పొందుతున్న మరికొంత మంది ప్రాణాలు కోల్పోతుండటంతో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో లక్నోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించినప్పటికీ, సురక్షిత ల్యాండింగ్‌తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment