జనసేన పార్టీ అధ్యక్షుడు (JanaSena Party President), డిప్యూటీ సీఎం (Deputy CM) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో (Pithapuram Constituency) ఇసుక మాఫియాను (Sand Mafia) మాజీ ఎమ్మెల్యే బయటపెట్టారు. మాఫియా రెచ్చిపోతున్నదని, దీనికి స్థానిక జనసేన నేతలు మద్దతు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ(TDP) మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ (S.V.S.N. Varma) తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లివారితోట ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను (Illegal Sand Mining) ఆయన స్వయంగా పరిశీలించి, ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
“మల్లివారితోట (Mallivarithota)లో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు 200 నుంచి 300 లారీల ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది, ముఖ్యంగా రాత్రి వేళల్లో. కానీ, పోలీసులకు ఈ అక్రమ రవాణా కనిపించడం లేదు. ఎందుకంటే, వారికి కావాల్సిన ‘మామూళ్లు’ వస్తున్నాయి. పోలీసులు ముందే సమాచారం ఇచ్చి, సర్దుకోమని చెబుతున్నారు” అని విమర్శించారు.
గత 20 రోజులుగా ఈ అక్రమ తవ్వకాల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. “ఇక్కడ దొంగతనం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇసుక మాఫియాతో పోలీసులు కుమ్మక్కైపోయారు” అని ఆయన ఆరోపించారు.
వర్మ (Varma) స్వయంగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆయన ఈ అక్రమాలపై జనసేన నేతలను పరోక్షంగా విమర్శిస్తూ, పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోవడానికి వారి మద్దతు కారణమని సూచనప్రాయంగా ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ-జనసేన (TDP–JanaSena) మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గతంలో కూడా జనసేన నేతలు, వర్మపై దాడి చేసిన ఘటనలు జరిగాయని, ఈ అక్రమ ఇసుక తవ్వకాల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం కొనసాగితే తీవ్ర చర్యలు తీసుకుంటామని వర్మ హెచ్చరించారు.