స్వ‌గ్రామం చేరుకున్న ముర‌ళీనాయ‌క్‌ భౌతిక కాయం

martyr-murali-naik-body-arrives-home-army-honors-pakistan-firing

భార‌త్‌-పాక్ (India-Pakistan) మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం జ‌రిపిన కాల్పుల్లో స‌రిహ‌ద్దులో వీర‌మ‌ర‌ణం పొందిన తెలుగు జ‌వాన్ (Telugu Soldier) మురళీ నాయ‌క్ (Murali Nayak) పార్థిక దేహం (Mortal Remains) స్వ‌గ్రామానికి (Native Village) చేరుకుంది. జ‌మ్మూక‌శ్మీర్ నుంచి విమానంలో బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముర‌ళీనాయ‌క్ భౌతిక‌కాయాన్ని స్థానిక మిలిట‌రీ అధికారులు స్వాధీనం చేసుకొని సైనిక వంద‌నం స‌మ‌ర్పించారు. అనంత‌రం మంత్రి స‌బిత ఆర్మీ అధికారుల‌తో క‌లిసి జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ భౌతిక‌కాయానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టు నుంచి వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ పార్థివ‌దేహాన్ని రోడ్డు మార్గం ద్వారా ఆర్మీ అధికారులు స్వ‌గ్రామానికి త‌ర‌లించారు. దారి పొడ‌వునా జ‌వాన్‌కు జోహార్లు అర్పించారు. జాతీయ జెండాలు ప‌ట్టుకొని జైహింద్ నినాదాల‌తో ర్యాలీలు చేప‌ట్టారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో పాకిస్తాన్ సైన్యం జ‌రిపిన కాల్పుల్లో ముర‌ళీ నాయ‌క్ వీర‌మ‌ర‌ణం పొందారు.

వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ స్వ‌స్థ‌లం శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా పెనుగొండ మండ‌లం గోరంట్ల మండలం, గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా. మురళీ నాయక్ మృతితో గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఒక్క‌గానొక్క కుమారుడి భౌతిక‌కాయాన్ని చూసి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. వీర‌జ‌వాన్‌కు నివాళుల‌ర్పించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జాసంఘాల ప్ర‌తినిధులు త‌ర‌లివ‌చ్చారు. రేపు సైనిక లాంఛనాలతో వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలు స్వ‌గ్రామంలో జ‌ర‌గ‌నున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment