తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీ (MP) ఇంట విషాదం నెలకొంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ (Uttarkashi) లో గంగోత్రి వైపు పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది . ఈ ప్రమాదంలో టీడీపీ ఎంపీ సోదరి (TDP MP Sister) దుర్మరణం చెందింది.తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ (Ambika Lakshminarayana) సోదరి (Sister) వేదవతి కుమారి (Vedavati Kumari) (48) హెలికాప్టర్ (Helicopter) ప్రమాదంలో (Accident) మృతి చెందారు (Died). ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ బావ భాస్కర్ (51) తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అతన్ని వెంటనే ఏమ్స్ రిషికేష్ ఆసుపత్రి (AIIMS Rishikesh Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎంపీ లక్ష్మీనారాయణ రిషికేష్కు బయలుదేరారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలానికి సహాయ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. విషాద ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.