సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ (Gandhi Bhavan) లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. సీఎం రేవంత్కు సీరియస్ వార్నింగ్ (Warning) ఇచ్చారు. “చివరిసారిగా చెప్తున్నా రేవంత్ రెడ్డి.. ఇకపై కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషిస్తే, నీ నాలుక (Tongue) చీరేసే రోజు వస్తుంది” అంటూ ఘాటుగా హెచ్చరించారు.
అలాగే ఇప్పటి వరకు రేవంత్ ఎంతటి విమర్శలు చేసినా పడ్డాం. కానీ, పరిమితులు దాటి వ్యక్తిగత దూషణలు చేస్తే మౌనంగా ఉండమని, గాడితప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేది కేసీఆరే (KCR) అని చెప్పారు. బీఆర్ఎస్(BRS) మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “ ఎన్నికల సమయంలో ప్రజల్ని మోసం చేసిన హామీలకుగాను మీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి” అంటూ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
నన్నెవరూ నమ్ముతలేరు, అప్పు పుడతలేదు.. అపాయింట్మెంట్ దొరకట్లేదు. దొంగను చూసినట్టు చూస్తున్నారు.. అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత దివాళ కోరుమాటలు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూనే రాష్ట్రానికి శాపనార్థాలు పెట్టిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని ఎయిడ్స్ పెషేంట్, క్యాన్సర్ పెషెంట్తో పోల్చాడని, చివరకు నిన్న తెలంగాణ దివాళా తీసింది అని కూడా సీఎం చేతులెత్తేశాడన్నారు. రేవంత్రెడ్డి మాటలే రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ. 4.17 లక్షల వేల కోట్లు మాత్రమేనని, అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడన్నారు.