వీరయ్య చౌదరి హత్య వెనుక సంచ‌ల‌న విష‌యాలు!

వీరయ్య చౌదరి హత్య వెనుక సంచ‌ల‌న విష‌యాలు!

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) క్రియాశీల‌క నాయ‌కుడు వీరయ్య చౌదరి (Veerayya Chowdary) హ‌త్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆఫీస్‌లో ఉన్న వ్య‌క్తిని ముసుగేసుకొని వ‌చ్చిన దుండ‌గులు (Assailants) క‌త్తుల‌తో (Knives) విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచి (Stabbed) చంపేశారు. ఆయ‌న ఒంటిపై 40కి పైగా క‌త్తిపోట్లు ఉండ‌డం షాక్‌కు గురిచేయ‌గా, ఇంత దారుణానికి పాల్ప‌డాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంద‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఈ సంద‌ర్భంలో వీర‌య్య చౌద‌రి గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ప్ర‌కాశం జిల్లా ప్ర‌జ‌ల ద్వారా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

వీర‌య్య‌పై ఆస‌క్తిక‌ర విష‌యాలు
వీర‌య్య చౌద‌రి స్వ‌త‌హాగా దుందుడుకు స్వ‌భావం క‌లిగిన వ్య‌క్తి అని, త‌న వ్య‌వ‌హార‌శైలి మూలంగా శత్రువులను సంపాదించుకున్నార‌ని, జిల్లాలో ప‌లువురిపై దాడులు (Attacks) చేసిన చ‌రిత్ర సైతం ఉంద‌న్న చ‌ర్చ ఆయ‌న హ‌త్య అనంత‌రం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో కూట‌మి ప్రభుత్వం (Alliance Government) క్రియేట్ చేసిన లిక్కర్ మాఫియా (Liquor Mafia) నే వీర‌య్య‌ హత్యకు దారి తీసింద‌ని జిల్లాలో సొంత పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌కాశం జిల్లాలోని ప‌దుల సంఖ్య‌ల్లో లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల చైన్ వీరయ్య చౌదరి ఆధీనంలోనే ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. లిక్కర్ సిండికేట్ (Syndicate) వ్యవహారంలోని వాటాల (Shares) విష‌యాల‌న్నీ ఇత‌నే చూసుకుంటాడ‌ని, ఆ వాటాల విష‌యంలో త‌లెత్తిన‌ పంచాయితీ హత్యకు దారి తీసిందన్న చర్చ జరుగుతోంది.

మ‌ద్యం సిండికేట్‌కు క‌ప్పం క‌ట్టాల్సిందేనా..?
కూట‌మి ప్రభుత్వం (Coalition Government) వచ్చిన తర్వాత మ‌ద్యం దుకాణాల (Liquor Shops) కేటాయింపు దగ్గర నుంచి బెల్ట్ షాపుల ఏర్పాటు వ్యవహారం మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆరోప‌ణ‌లున్నాయి. టెండర్లలో వైన్ షాప్ ఎవరు ద‌క్కించుకున్నా సరే ఆ దుకాణాల్లో వాటాలివ్వడం లేదా 30 శాతం కమీషన్ (30% commission) ఇవ్వడం గానీ, ఆ దుకాణాన్ని కూటమి నాయకులకు చెందిన సిండికేట్ చేతుల్లో పెట్టేయాల‌నే హుకుం జారీ అయిన‌ట్లుగా గ‌తంలో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. సిండికేట్ విధానానికి ఎవ‌రూ ఎదురువెళ్లినా దాడులు చేయడం, బెదిరించడం, కేసులు పెట్టడం వంటి సంఘ‌ట‌న‌లు రాష్ట్రంలో అనేకం చూశాం. మ‌ద్యం షాపుల కింద ప్రతి గ్రామంలో, వీధిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటయిన విష‌యం తెలిసిందే. గ్రామాల్లో బెల్ట్ షాపుల ఏర్పాటుకు వేలంపాట నిర్వ‌హిస్తున్న వీడియోలు గ‌తంలో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. సాక్షాత్తూ హోంమంత్రి (Home Minister) నియోజ‌క‌వ‌ర్గంలో ఒక బెల్ట్‌షాప్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.10 ల‌క్ష‌ల‌కు పైగా పాట‌పాడి కైవ‌సం చేసుకున్న వార్త‌లు బ‌య‌ట‌కొచ్చాయి. ఇలా బెల్ట్ షాపుల్లోనూ వేలం పాటలు పాడి వచ్చిన డబ్బు కమీషన్లుగా వాటాలు పంచుకుంటున్నార‌న్న చ‌ర్చ ఇప్ప‌టికే ఉంది. గ‌తంలో ప్రభుత్వ పెద్దలే ఈ మొత్తం మాఫియాను నడిపించడంతో ఎక్సైజ్ (Excise), పోలీసులు కూడా భాగస్వాములుగా మారారే తప్ప ఎక్కడా నియంత్రించలేదన్న ఆరోపణలున్నాయి.

అన‌తికాలంలోనే విప‌రీతంగా సంపాద‌న‌!
ఇలా ఏర్పడ్డ లిక్కర్ సిండికేట్.. ప్ర‌తిరోజూ సాయంత్రం ఎవ‌రి వాటాలు వారికి లెక్కేసి, మరుసటి రోజు తెల్లావారుజామునే వారికి చేర‌వేసేద‌ట‌. లిక్కర్ మాఫియా సంస్కృతిలో తలెత్తిన పొరపచ్చాలు, విభేదాలు వీరయ్య హత్యకు కారణమయ్యాయన్న చర్చ జోరుగా న‌డుస్తోంది. జిల్లాలో పదుల కొద్దీ మ‌ద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా ఏర్ప‌డిన బెల్ట్ షాపులను వీర‌య్య చౌద‌రి పర్యవేక్షిస్తుండేవాడని, చంద్రబాబు (Chandrababu), లోకేష్‌ (Lokesh)ల‌తో క్లోజ్‌గా అసోసియేట్ అవుతూ అనతి కాలంలోనే విపరీతంగా డబ్బులు సంపాదించాడని సొంత‌పార్టీ నాయకులే అనుకుంటున్నారు.

ఆ అంశాన్ని మ‌రుగున‌ప‌రిచారా..?
వీర‌య్య చౌద‌రి ఏకంగా 15 నుంచి 17 కేసుల్లో నిందితుడుగా ఉన్న‌ట్లుగా చెప్పుకుంటున్నారు. ఏకంగా 17 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి హత్యకు గురైతే ఆ అంశాలను మరుగునపర్చి.. రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే చ‌ర్చ ఊపందుకుంది. వీర‌య్య గురించి స‌ర్వం తెలిసిన ప్రకాశం జిల్లా ప్రజలకు కూట‌మి ప్ర‌య‌త్నం ఆగ్రహాన్ని తెప్పిస్తోంద‌ని స్థానికులు అంటున్నారు. మొద‌టి అత‌ని వ్యాపారాలు, అందులోని జ‌రిగిన లావాదేవీల‌పై దృష్టిసారించ‌కుండా, చ‌నిపోయిన వెంట‌నే మ‌రొక పార్టీపైకి నెట్టి, హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను తొక్కేయాల‌ని చూడ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మంటూ టీడీపీ నేత‌లే ఆరోపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఆస్ప‌త్రికి వెళ్లిన‌ హోంమంత్రి
రాష్ట్రంలో మహిళలపై జ‌రిగే హ‌త్యాచారాలు, ఉన్మాదుల దాడుల్లో యువ‌తులు బ‌లైన సంద‌ర్భాల్లో స్పందించడానికి ఆసక్తి చూపని, వాటి దర్యాప్తు విషయంలో చొరవ చూపని హోంమంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచే మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Minister Vangalapudi Anitha) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో సర్వే చేసి డమ్మీ హోం మంత్రుల జాబితా తీస్తే మొదటిగా అనిత నిలుస్తార‌ని, అభినంద‌న‌లు మేడ‌మ్ అంటూ సొంత పార్టీ నేత‌లే ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అంత‌టి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న హోంమంత్రి హుటాహుటిన వీర‌య్య చౌద‌రికి పోస్టుమార్టం నిర్వ‌హించే ఆస్ప‌త్రికి వెళ్ల‌డం, ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డం, ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటు చేశామ‌ని ప్ర‌క‌టించ‌డం, మ‌రుస‌టి రోజు ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి వీర‌య్య అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌వ్వ‌డం వంటి విష‌యాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే వీరయ్య చౌదరికి తెలుగుదేశం పార్టీకి మ‌ధ్య‌ ఆర్థిక సంబంధాలు ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంద‌ని ప్ర‌కాశం ప్ర‌జ‌లు, సొంత పార్టీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment