స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC – Member of Legislative Council) ఎన్నికలో బీజేపీ (BJP) కి షాక్ తగిలింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజధానిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ (AIMIM Party) ఘన విజయం సాధించింది. శుక్రవారం కౌంటింగ్ చేపట్టగా, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ (Mirza Riyaz Hassan) ఏకంగా 63 ఓట్లతో విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు (Gautam Rao) కేవలం 25 ఓట్లకే పరిమితమయ్యారు.
ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటీలో లేకపోవడంతో ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం మధ్య పోటీ నెలకొంది. మొత్తం 112 ఓట్లకు గానూ 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఓటింగ్ శాతం చూసినా, ఎంఐఎం విజయం స్పష్టంగా కనిపించింది. మీర్జా రియాజ్ హసన్ గెలుపు ఎంఐఎం పార్టీకి మళ్లీ మద్దతు పెరుగుతోందని సంకేతాలిచ్చింది.