తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి తదితర వంటి మాదక ద్రవ్యాలు అప్పుడప్పుడు కనిపిస్తున్నా, కొకైన్ వంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యం మాత్రం ఇంతవరకు కనిపించలేదు. కానీ, ఇటీవల ఏపీలో కొకైన్ కల్చర్ పెరిగిపోతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక వంద రూపాయలకే మద్యం సరఫరా చేస్తోంది. ఆ కిక్ సరిపోదన్నట్లు.. వ్యసనపరులు కొత్త అలవాట్లు కొని తెచ్చుకుంటున్నారు.
ఈ ఏడాది జనవరి 20వ తేదీ గుంటూరులో కొకైన్ కలకలం రేపింది. రాష్ట్రంలో కొకైన్ పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గుంటూరులో ముగ్గురు యువకుల నుంచి 8.5 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మరువకముందే తాజాగా మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో 8 గ్రాముల కొకైన్తో పాటు 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.