హెచ్‌సీయూ భూవివాదం.. తెలంగాణ‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌

హెచ్‌సీయూ భూవివాదం.. తెలంగాణ‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం రాజకీయంగా వేడెక్కింది. వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు బీజేపీ (BJP) నేతలు బయలుదేరగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ముందుగా భారీగా పోలీసులు మోహరించారు.

బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) ని హౌస్ అరెస్ట్ (House Arrest) చేయగా, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ (Payal Shankar), దన్ పాల్ సూర్యనారాయణ గుప్త (Dan Paul Suryanarayana Gupta) సహా పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ వద్ద విద్యార్థులు (Students) నిరసనకు పిలుపునివ్వడంతో, పోలీసులు భారీ గేట్లను ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల్లో జనాలను పంపివేస్తున్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన
ఈ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandisanjay) మండిపడ్డారు. “గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మించిపోయేలా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వేలం వేయాలని చూస్తున్న 400 ఎకరాల భూమి అటవీశాఖ పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుల ప్రకారం, అటవీశాఖ భూములను కేంద్ర అనుమతి లేకుండా నరికి వేయలేరు. హైకోర్టు (High Court)లో కేసు నడుస్తున్నా, ప్రభుత్వ విధ్వంస చర్యలు కొనసాగుతున్నాయి” అని ఆయన విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment