కారు డిక్కీలో మహిళ మృతదేహం.. పోలీసులు షాక్‌

కారు డిక్కీలో మహిళ మృతదేహం.. పోలీసులు షాక్‌

వాహ‌నాల త‌నిఖీలో పోలీసుల‌కు ఊహించ‌ని సంఘ‌ట‌న ఎదురైంది. కారు (Car) లో డెడ్ బాడీ (Dead Body) లభ్యమైన ఘటన నిజామాబాద్‌ (Nizamabad) లో కలకలం రేపింది. పోలీసులు (Police) సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ కారు డ్రైవర్ ఆగకుండా ముందుకు వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి వెంబ‌డించి ఆ కారును పట్టుకున్నారు.

దాస్నగర్ (Dasnagar) శివారులోని నిజాంసాగర్ కెనాల్ (Nizamsagar Canal) వద్ద కారును అడ్డగించిన పోలీసులు డిక్కీని పరిశీలించగా అందులో ఒక మ‌హిళ మృతదేహం ల‌భ్య‌మైంది. మృతురాలు కమల (Kamala) అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్య కేసులో రాజేశ్ (Rajesh) అనే వ్యక్తి నిందితుడిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment