ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి హిందూ ధర్మ పరిరక్షణ (Hindu Dharma Protection) పై మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు పవన్కు లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. హైందవ ధర్మ పరిరక్షణ, కాశీనాయన ఆశ్రమం (Kashinayana Ashram) గురించి వివరిస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం (Coalition Government) పై తన కామెంట్స్ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు వైఎస్ జగన్. దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? అని ప్రశ్నించారు.
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత (Construction Halt), వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023 (August 07, 2023)న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ (Central Environment & Forest Ministry) ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం నడుంబిగించి ఆగస్టు 18, 2023 (August 18, 2023) న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) కి సీఎం హోదా తానే స్వయంగా లేఖరాశానని వైఎస్ జగన్ గుర్తుచేశారు. కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల (Hectares) భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం (Compensation) కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పామన్నారు. వైసీపీ ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసిందన్నారు.
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు (Chandrababu) ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఉన్న పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఉత్తర్వులిచ్చి, వారి చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ (Venkateswara Swamy Temple) ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ (Tirumala Laddu) దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ (TTD) చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు (Devotees) మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతేనన్నారు. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు (Attacks) చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులు (Religious Protectors) గా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లేనన్నారు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నించారు.
నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025