కోర్టు ఆదేశాల‌ను సీఎం రేవంత్ ధిక్క‌రించారు – హ‌రీష్‌రావు

కోర్టు ఆదేశాల‌ను సీఎం రేవంత్ ధిక్క‌రించారు - హ‌రీష్‌రావు

Summarize with AI

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పై బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టు వ్యవహారాల గురించి మాట్లాడొద్దని జ్యుడీషియల్ (Judicial) ఆదేశాలు ఇచ్చినా, సీఎం (CM) సభలో కోర్టు ఆదేశాల‌ను ధిక్కరించారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనకు దారితీస్తుందని హరీష్ రావు హెచ్చరించారు. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత‌గూటిలో చేర‌వచ్చనే అనుమానం ముఖ్యమంత్రికి ఉండొచ్చని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. అందుకే ఉప ఎన్నికలు (By-elections) రాబోవని చెబుతున్నారన్నది పూర్తిగా రాజకీయ నాటకమే అని విమర్శించారు.

క్రైమ్ రేటు పెరుగుతోంది.. ప్రభుత్వ వైఫల్యం
రాష్ట్రంలో నేరాలు (Crimes) విపరీతంగా పెరుగుతున్నాయి అని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే రెండు హత్యలు (Murders), రెండు అత్యాచారాలు (Rapes) రాష్ట్రంలో చోటుచేసుకున్నాయని అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సీసీ కెమెరాలు (CCTV Cameras) సరైన నిర్వహణ లేకపోవడం, ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం వల్లే నేరాల సంఖ్య‌ పెరుగుతోంద‌ని అని విమర్శించారు.

భూముల అమ్మకాలపై విమర్శలు
ఫ్యూచర్ సిటీలో ఐదో రహదారి అవసరమేంటని హరీష్ రావు ప్రశ్నించారు. “మీ అత్తగారి భూముల (Mother-in-law’s Lands) కోసం ఐదు వేల కోట్లు (₹5,000 Crores) ఖర్చు పెడతారు.. కానీ ప్రజల అవసరాల కోసం అంత ధనం ఎందుకు పెట్టడం లేదు?” అని ఎద్దేవా చేశారు. భూముల అమ్మకాన్ని గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన ప్రభుత్వమే ఇప్పుడు ఐఎంజీ (IMG) భూములు అమ్మేందుకు సిద్ధమవుతోంది అని మండిపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment