’18 ల‌క్ష‌ల మందితో పార్టీ నిర్మాణం’ – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

'18 ల‌క్ష‌ల మందితో పార్టీ నిర్మాణం' - జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

వైసీపీ (YSRCP) పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో (Parliament Constituency Observers) మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (Y.S. Jagan) భేటీ అయ్యారు. ప‌రిశీల‌కుల నియామ‌కం త‌రువాత ఇదే మొట్ట‌మొద‌టి స‌మావేశం. ఈ సంద‌ర్భంగా పార్టీ నిర్మాణం, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుల నిర్వ‌ర్తించాల్సిన విధుల‌పై పార్టీ అధ్యక్షులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌రిశీల‌కులుగా నియ‌మితులైన‌వారంతా సమర్థులని భావించి బాధ్యతలు అప్పగించాన‌ని, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాల‌ని సూచించారు. జిల్లాస్థాయి (District Level) నుంచి గ్రామస్థాయిలో (Village Level) ఉన్న బూత్‌ కమిటీల (Booth Committees) వరకూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. పార్టీలో ఇంత‌కు ముందున్న రీజినల్‌ కో-ఆర్డినేటర్ల (Regional Coordinators) వ్య‌వ‌స్థ‌కు పార్లమెంటు పరిశీలకులు సహాయకారులుగా ఉంటారని చెప్పారు. పనితీరు ఆధారంగా మున్ముందు రోజుల్లో మంచి మంచి పదవులు వస్తాయని సూచించారు.

జ‌గ‌న్‌లో అదే ధీమా..
కూట‌మి ప్రభుత్వం (Alliance Government) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తప్పకుండా వైసీపీ అధికారంలోకి వస్తుంద‌ని, అందులో త‌న‌కు ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా అమ‌లు చేసిన వైసీపీకి ప్ర‌తిప‌క్షంలో కూర్చోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటే.. ఎన్నిక‌ల ముందు అనేక హామీలిచ్చి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌ని చంద్ర‌బాబు (Chandrababu Naidu) ప‌రిస్థితి మున్ముందు ఎలా ఉండ‌బోతుందో అర్థం చేసుకోవాల‌న్నారు. చంద్రబాబు రాకముందు.. వైసీపీ పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవని, చంద్రబాబు వ‌చ్చాక ప్రజలు తింటున్న కంచాన్ని లాగేసుకొని, తాను ఇచ్చిన హామీల‌ను కూడా అమ‌లు చేయ‌క‌.. రెండు ర‌కాలుగా ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడ‌ని ఆరోపించారు.

కూట‌మి అవినీతి ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తోంది..
రైతులకు ఉచితంగా విద్యుత్‌ (Free Power for Farmers) అందించడానికి సెకీతో (SECI – Solar Energy Corporation of India) వైసీపీ ప్ర‌భుత్వం రూ.2.49లకే విద్యుత్‌ కొనుగోలు చేస్తే.. కూట‌మి ప్ర‌భుత్వం రూ.4.60లకు కొనుగోలు చేసింద‌ని ప్ర‌స్తావించారు జ‌గ‌న్‌. సెక్షన్‌ 108 ప్రకారం ఏపీఆర్సీపీ (APRC) మీద ఒత్తిడి తెచ్చి మరీ అమలు చేయించుకున్నారని చెప్పారు. కూట‌మి ప‌రిపాల‌న‌లో జ‌రుగుతున్న అవినీతి ప్ర‌జ‌ల కంటికి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌న్నారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులు, బెల్టుషాపులు, ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ‌ లిక్కర్ అమ్మ‌కాలు వంటి కార్య‌క్ర‌మాలు నిత్యం ప్ర‌జ‌ల‌కు ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉన్నాయ‌ని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తార‌న్నారు.

నాలో చాలా మార్పు వ‌చ్చింది..
కూట‌మి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత త‌నలో చాలా మార్పు వచ్చిందని వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరినీ గొప్ప స్థానంలో కూర్చోబెడతానన్నారు. ఈసారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంద‌ని, తాను చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేనన్నారు. ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్పారు. చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారని, క‌లియుగం పాలిటిక్స్ న‌డుస్తున్నాయ‌న్నారు వైఎస్ జ‌గ‌న్‌. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమ‌ని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిశీల‌కుల‌కు సూచించారు. చంద్రబాబు (Chandrababu Naidu) రెడ్‌బుక్‌ రాజ్యాంగం (Red Book Constitution), కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైందన్నారు.

వ‌చ్చే ఏడాది ప్లీన‌రీ
కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందని, కేడర్‌ ధైర్యంగా నిలబడిందని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తాను ఎక్కడకు వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారన్నారు. రాజకీయాలతో సంబంధం లేనివారినికూడా కక్షలకు గురిచేస్తున్నారన్నారు. వచ్చే ఏడాది ప్లీనరీని (Plenary) బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దామ‌ని భేటీలో జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. బూత్‌ కమిటీలు పూర్తయ్చే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షలమంది (18 Lakh Members) ఉంటారని, అప్పుడు మ‌న బ‌లం పెరుగుతుంది, ప్ర‌భుత్వంపై పోరాడే గొంతులు కూడా పెరుగుతాయ‌ని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment