ఎన్నికల అనంతరం ప్రతిపక్షంలో కూర్చున్న వైసీపీ(YCP).. వివిధ అంశాలపై అధికార కూటమి పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో రైతులు, విద్యుత్ సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ తాజాగా విద్యార్థుల (Student) కోసం మరో ఆందోళన చేపట్టనుంది.
విద్యార్థులకు విడుఆల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement), వసతిదీవెన పథకాల నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఫిబ్రవరి 5న ఆందోళన చేపట్టనుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పిలుపు మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ధర్నాలను నిర్వహించనున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నారు. విద్యార్థులు సమస్యలపై పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను త్వరలో విడుదల చేయనున్నారు. .
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలుగా గడుస్తున్నా.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయలేదని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో పాటు, విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వైసీపీ ఫిబ్రవరి 5న నిర్వహించే ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేయనుంది.