రంగా వ‌ర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్

రంగా వ‌ర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్

వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ టార్గెట్‌గా అంబ‌టి ఓ ట్వీట్ చేశారు. అంబ‌టి ట్వీట్ ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచింది. “దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు. జోహార్ వంగవీటి మోహన రంగా” అని ఆయన ఎక్స్‌ (ట్విట్టర్) వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. అంబ‌టి ట్వీట్‌పై టీడీపీ మండిప‌డుతోంది.

1988లో విజయవాడలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో వంగవీటి మోహన రంగా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ఆ సమయంలో తీవ్ర కలకలం రేపింది. అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తుచేసేలా చేశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment