దాయాదీ దేశం పాకిస్తాన్ను టీమిండియా చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రిజ్వాన్ సేన 49.4 బంతులకే ఆలౌటైంది. కేవలం 241 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బ్యాట్స్మెన్స్లో షకీల్ (62), కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (46), కుష్దిల్ షా (38) మాత్రమే రాణించగా, టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా 2 కీలక వికెట్లు తీశాడు.
242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టార్గెట్ను సునాయాసంగా చేధించింది. 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి విజయాన్నందుకుంది. వన్ డౌన్ బ్యాటర్గా క్రీజ్లోకి దిగిన విరాట్ కోహ్లి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆఖరి వరకు క్రీజ్లోనే నిలబడి మెరుపు శతకం సాధించాడు. భారత్ గెలుపునకు కీలక భూమిక పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. కోహ్లి 100 నాటౌట్, శుబ్మన్ గిల్ 46, శ్రేయస్ అయ్యర్ 56 పరుగులు సాధించారు.