టీటీడీ (TTD) గోశాల (Cow Shelter) వ్యవహారంపై వివాదం మళ్లీ రగిలింది. గత ఏప్రిల్లో గోశాల గురించి వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy)పై ఇటీవల టీటీడీ కేసు(Case) నమోదు చేయించింది. తాజాగా నిన్న జరిగిన బోర్డు సమావేశంలో గోశాల నిర్వహణ సరిగ్గాలేదని స్వయంగా అంగీకరించడం సంచలనంగా మారింది.
గోశాల గురించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడే (B.R.Naidu) వాస్తవాలను ఒప్పుకున్నాడని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి పాలకమండలి సమావేశంలో బీఆర్ నాయుడు స్వయంగా గోశాల సమస్యలను అంగీకరించి, దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారని భూమన చెప్పారు. నిపుణుల కమిటీని వేసి నిర్వహణను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చే ఆలోచన ఉందని, వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్వయంగా టీటీడీ చైర్మనే అన్నారని గుర్తుచేశారు.
టీటీడీ గోశాల నిర్వహణ సరిగ్గా లేదు.. ఈ విషయం బోర్డు దృష్టికి వచ్చింది
— Telugu Feed (@Telugufeedsite) October 29, 2025
గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి నిపుణుల కమిటీని వేసి గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎవరికైనా సంస్థలకు ఇచ్చేటువంటి ఆలోచన
– టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు https://t.co/16MBow1knM pic.twitter.com/cn7ezCavfE
తాను కూడా గోశాల నిర్వాహణ సరిగ్గా లేదని, అందువల్లే గోవులు మరణిస్తున్నాయన్న విషయాన్ని ఏప్రిల్ నెలలో తాను చెప్పానని భూమన కరుణాకర్రెడ్డి చెప్పారు. ఈ మాట చెప్పినందుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని తనపై ఉసిగొల్పి, తన మీద మత విద్వేషాలను, హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నానని కేసు పెట్టించారన్నారు. గోశాల నిర్వహణపై వాస్తవాన్ని అంగీకరించిన తనపై పెట్టిన సెక్షన్ల కిందనే కేసు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేశారు.
బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) October 29, 2025
గోశాల నిర్వహణ సరిగ్గా లేదని టీటీడీ చైర్మనే ఒప్పుకున్నారు
ఈ మాట చెప్పిన నాపై కేసు పెట్టిన భానుప్రకాష్రెడ్డి.. టీటీడీ చైర్మన్పై కేసు పెట్టగలరా..?
బోర్డ్ మెంబర్ భానుప్రకాశ్రెడ్డిని నాపై ఉసిగొల్పి కేసు పెట్టించారు
నాపై ఏ సెక్షన్లతో అయితే మీరు కేసులు… https://t.co/CYc7lnBYyZ pic.twitter.com/tfbBckdWJ6
దాదాపు 70 ఏళ్ల టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోశాలను బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత నిర్వీర్యం అయిపోయిందని భూమన కరుణాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే ఆలోచన తప్పు అని ఖండించారు. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేదు, గోశాలను సరిగ్గా నిర్వహించలేదంటూ మండిపడ్డారు. బీఆర్ నాయుడు ఉసిగొల్పి పెట్టించే తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తి లేదని, మాజీ చైర్మన్గా, వెంకన్న భక్తుడిగా అన్యాయాలను ఎత్తి చూపించే బాధ్యత తనపై ఉందన్నారు.





 



