తిరుమలలో రేపు VIP దర్శనాలు రద్దు

తిరుమలలో రేపు VIP దర్శనాలు రద్దు

ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). ఈ ఏడాది జనవరి 10 నుండి 19వ తేదీల వరకు వైకుంఠ ద్వార దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి, జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం వల్ల ఆ రోజు VIP బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. రేపు స‌ర్వ‌ద‌ర్శ‌నాలు మాత్ర‌మే ఉంటాయ‌ని, ఈ విష‌యాన్ని భ‌క్తులు గ్ర‌హించాల‌ని టీటీడీ తెలిపింది. అలాగే, టీటీడీ 6వ తేదీ నుండి సిఫార్సు లేఖలను స్వీకరించ‌డం లేద‌ని, ఈ విషయాన్ని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment