తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారుల చేతిలో పట్టుబడింది. విశేషం ఏమిటంటే.. ట్యాక్సీ డ్రైవర్ల సహాయంతో ఈ టికెట్లు అధిక ధరలకు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక కౌంటర్ సిబ్బందిలో లక్ష్మీపతి అనే వ్యక్తి ఈ కుట్రలో భాగస్వామి కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఐదుగురు అరెస్ట్.. విచారణ
నకిలీ టికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న కేసులో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ముఠాపై లోతుగా విచారణ జరుగుతోంది. శ్రీవారి దర్శన టికెట్లను నకిలీగా తయారు చేసి భక్తులను మోసం చేయడం సామాన్య భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.